ద్విపదభాగవతం - మధురకాండ : ఉద్ధవుఁడు గోపికల మాటలను విని వారి పుణ్యమునకై మెచ్చుకొనుట
తనరారఁ జెప్ప నుద్ధవుఁడు చిత్తమున;
“వీరు దన్యాత్ములు వీరు పావనులు
వీరికి శౌరికి వేరు లేదెందు
వీరలఁ గనుఁగొంట విష్టునిఁ గంట
వీరికై హరివచ్చి వ్రేపల్లెఁ బెరిగె
నిన్ని చందంబుల నీమందవారి
మన్నించి కృష్ణుఁడు మమత వాపించి. - 420
నామీఁదఁ గృపఁగల్గి నన్ను మన్నించి
యీ మహాకార్యార్థ మిటు వచ్చెశారి
యిది జన్మఫలసార మిదిదోషమార
మిదిగదా సౌభాగ్య మిదిగదా యోగ్య”
మని సంతసిల్లుచు, నతివలుఁ దాను
జనుదెంచి ప్రేమ మజ్జనభోజనములు
సలిపి, గోపికలు నిచ్చలు మానసములఁ
గలిసి చెప్పక విష్ణుకథలెల్ల వినుచుఁ;
నందయశోదలున్నతిఁ గారవింప
మందవారెల్ల సమ్మతి విందులిడఁగ
నొకకొన్ని నెలలుండి యుద్ధవుండంత;